జాతి బాగు కోసం కృషి చేస్తా

జాతి బాగు కోసం కృషి చేస్తా
  • జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జటోత్ హుస్సేన్ 

బషీర్​బాగ్, వెలుగు: ఎస్సీ, ఎస్టీలు సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా వివక్షకు గురి కావడం బాధాకరమని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జటోత్ హుస్సేన్​ అన్నారు.  జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమితులైన సందర్భంగా ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు.  హైదరాబాద్ అబిడ్స్​లోని పర్వానా హల్​లో జరిగిన కార్యక్రమంలో ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ బ్యాంక్ సీజీఎం రాజేశ్​కుమార్​తో కలిసి జటోత్ హుస్సేన్​ మాట్లాడారు.  33 ఏండ్ల తర్వాత తెలుగు బిడ్డకు ఎస్టీ కమిషన్ సభ్యుడి పదవి దక్కిందన్నారు.  జాతి బాగు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కొంత మంది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దాని వల్ల నిజమైన బాధితులు నష్టపోతున్నారన్నారు.